హైదరాబాద్, నవంబర్ 4( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజస్థాన్ కాంగ్రెస్ దళిత నేత, ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు ఖిలాడీలాల్ భైరవ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. సీఎం అశోక్ గెహ్లాట్ దళితుల పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగానే ప్రవర్తించారని, వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్నారు.
దళిత ఐఏఎస్ అధికారులకు ప్రాముఖ్యమున్న పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ ఆదేశానుసారం తనను ఎస్సీ కమిషన్ అధ్యక్షుడిగా నియమించినా.. రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఖిలాడీలాల్.. బసోడి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డారు.