తన కండ్ల ముందే తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను సైతం నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ నాశనమవుతుంటే తాను మౌనం పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 50వేల మంది రైతులను తీసుకుని పండబెట్టి తొక్కుకుంట పోయి మేడిగడ్డను రిపేర్చేయిస్తానని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తమకు ప్రయోజనం చేకూరిందని ప్రజలే చెప్తున్నరని, ఒకప్పుడు 50 టన్నుల వడ్లు పండించిన తెలంగాణ నేడు మూడున్నర కోట్ల టన్నులు ఎంట్ల పండించిందని కేసీఆర్ ప్రశ్నించారు. టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ కాళేశ్వరంపై పూసగుచ్చినట్టు చెప్పిన వివరాలు ఇవీ..
కేసీఆర్: ఎందుకు సాధ్యంకాదు. సాధ్యమే. ఐ విల్ డూ ఇట్. నా కండ్ల ముందే తెలంగాణను, కాళేశ్వరం ప్రాజెక్ట్ను నాశనం చేస్తుంటే నేను మౌనం పాటించే ప్రసక్తిలేదు. ఎవరడ్డొస్తరో రండి. 50వేల మంది రైతులను తీసుకుని పండబెట్టి తొక్కుకుంట పోయి రిపేర్చేయిస్త. పంపులు నడుపుత. ఇదే విషయాన్ని మొన్న కరీంనగర్ సభలో కూడా చెప్పిన.
కేసీఆర్: ప్రభుత్వ చేయాల్సిన పని చేయకపోతే ఏం చేయాలె. ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం మొండికేసి చేయకపోతే ప్రజానీకమే చేసుకుంటారు. మేం చేసి చూపిస్తాం. టైమ్ గెట్ ఇట్ డన్. ఇది కోటానుకోట్ల కుటుంబాలు. లక్షలాది రైతులు కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ కోసం, చిల్లర రాజకీయాల కోసం బలిపెడతమంటే ఎట్లా ఊరుకుంటాం. తెలంగాణ సమాజం ఎట్లా సహిస్తది. ఎందుకు ఊకోవాలె? ఇది నిజం కాదా? టన్నెల్స్కు ఏమన్నా అయ్యిందా? రిజర్వాయర్లకు ఏమన్నా అయ్యిందా? పంప్హౌజ్లకు ఏమైనా అయ్యిందా? కాల్వలకు ఎమైనా అయ్యిందా? మీది రెండు బ్యారేజీలకు ఏమన్నా అయ్యిందా? ఇంత వెర్రి చేతలా? ఈ గ్రౌటింగులు, గ్రోటింగ్లు ఎప్పుడూ ఉండేవే.
కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా వాడుకోవాలో ఈ అర్భకులకు తెలియలేదు. అసలు ఆ ప్రాజెక్టుపై వాళ్లకు అవగాహనే కాలేదు. ఇంజనీర్లు చెప్పినా కూడా వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు.
– కేసీఆర్
KCR | హైదరాబాద్, 23 (నమస్తే తెలంగాణ): “గోదావరిలో వర్షాలు పడేకొద్దీ వరద పెరుగుతుంది. 70వేలు, 80వేలు, లక్ష క్యూసెక్కులకు పైగా వరదొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలు మొత్తం గేట్లు మూయకుండా వరద పోయేందుకు అటు చివరన రెండు, ఇటు చివరన రెండు, నాలుగు చొప్పున గేట్లు తెరుస్తుంటరు. మధ్యలో ఉన్న గేట్ల మూసి పెడతరు. నీళ్లు వచ్చినకొద్దీ కిందికి వదులుతుంటరు. కాలం గడుస్తున్నకొద్దీ నదీ ప్రవాహాన్ని గమనించుకుంటూ ఒక్కో గేట్ తెరుస్తుంటరు. కాళేశ్వరం స్టోరేజీ కెపాసిటీయే 16 టీఎంసీలు. మొదట 20 టీఎంసీలు అనుకున్నా, 16 టీఎంసీలకు మహారాష్ట్రను ఒప్పించినం. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కెపాసిటీ16 టీఎంసీలు ఒకేసారి నింపి ఉంచరు. వరద ఒకేసారి వస్తే వాష్ అవుట్ అవుతుందని మొత్తం నింపరు. ఫిబ్రవరిలో గోదావరిలో 30-40 వేల క్యూసెక్యులొస్తాయి. 6-8 టీఎంసీలు బ్యారేజీలో ఉంచుకుంటూ విడుదల చేస్తుంటారు. ఈ నీళ్లు రెండోపంటను కాపాడుకోవడం, సాగునీరు, తాగునీటికి ఉపయోగిస్తరు. మేం మూడు బ్యారేజీలు కట్టినం. ఒకటి 16 టీఎంసీలు, మరొకటి 7 టీఎంసీలు, ఇంకొకటి 11 టీఎంసీలు. ఈ మూడింటి మీద ఎల్లంపల్లి వద్ద 20 టీఎంసీలుంటాయి. రాజశేఖర్రెడ్డి పెట్టిన 14 టీఎంసీల ప్రాణహిత చేవెళ్ల నుంచి మేం 147 టీఎంసీల స్టోరేజీ గల బ్యారేజీలు కట్టినం. 200 కిలోమీటర్ల టన్నెల్స్, బహ్మాండమైన సర్జ్పూల్స్, 1500 కిలోమీటర్ల కాల్వలు తవ్వినం.
మూడు బ్యారేజీల మీద కట్టిన అన్ని పిల్లర్లు క్షేమంగా నిక్షేపంగా ఉన్నయి. కాల్వల మీద కట్టిన బ్రిడ్జిలు, వాటి కింద కట్టిన వందలాది పిల్లర్లు క్షేమంగా ఉన్నయి. ఏం ప్రమాదం జరగలే. ప్రపంచం మునిగిపోలే. ఇటీవలే నా దాడికి తట్టుకోలేక నందిమేడారం పంపుహౌజ్ను కాంగ్రెసోళ్లే నడిపిండ్రు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ టన్నెల్స్, సర్జ్పూల్స్ అని ఇన్టాక్ట్ ఉన్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజీ వివిధ బ్లాకుల్లో ఉన్నది. అందులోని 7వ బ్లాక్లో 10, 11 పిల్లర్లున్నాయి. వీటిలో రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఒక పిల్లర్ కొంచెం తక్కువ పగుళ్లు చూపాయి. ఎన్నికలకు ముందే పగుళ్లు వచ్చాయి. ఎందుకు జరిగిందని నేను ఆరాతీసిన. అంతకు ముందు సంవత్సరంలో 28 లక్షల క్యూసెక్యుల భయంకరమైన వరదొచ్చింది. అప్పుడే కన్నెపల్లి పంప్హౌజ్ మునిగింది. దాన్ని రిపేర్ చేసినం. ఇంతకు ముందులేనట్టుగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీ పోస్టును క్రియేట్చేసినం. నాగేందర్ అనే మంచి ఇంజినీర్ను నియమించినం. సీఈ దానిని సరిచేయాల్సి ఉండె. అది సర్దకపోవడం వల్ల ఇసుక కుంగి ఒక బ్లాక్లో పగులొచ్చాయి. అట్లనే వదిలేస్తే కేసీఆర్ను, బీఆర్ఎస్ గవర్నమెంట్ను, కాళేశ్వరం ప్రాజెక్ట్ను మరింత బద్నాం, డ్యామేజీ చేయాలన్న దురుద్దేశంతో వదిలేశారు.
ఇసుక కాఫర్ డ్యాం వేసినా పంపులు నీళ్లను పంపింగ్ చేస్తయి. కాంగ్రెసోళ్లు మొత్తం బ్యారేజీ కొట్టుకుపోవాలని చూశారు. ఈ ప్రభుత్వం ఈ ఒక్క బ్లాక్ను రిపేర్ చేయకపోయినా, మిగతా బ్లాక్లు వందేండ్ల వరకు అలాగే ఉంటాయి. తెలంగాణ రావడానికి ఒకటిన్నర సంవత్సరాలకు ముందే మిషన్కాకతీయ ప్లాన్ చేసినం కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చినం. మిషన్ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యాన్ని పెంచినం. కట్టలు బందబస్తుచేసినం. మత్తళ్లు, చెరువులు, తూములు బందబస్తు చేసినం. ఎంత పెద్ద వరదొచ్చినా కొట్టుకు పోకుండా చేసినం. కాళేశ్వరం కాలువలు, గతంలో ఉన్న కాలువల ద్వారా 11వేల చెరువులు నింపినం. మీ టీవీ 9లోను ఎండాకాలంలో మత్తళ్లు దుంకుతున్న చెరువులు, చెక్డ్యామ్లు అన్న వార్తలొచ్చినయి. రూ. 4వేలకోట్లు పెట్టి అన్ని ఉపనదులు, వాగులు, వంకల మీద 1200 చెక్డ్యామ్లు మంజూరుచేసినం. ఇప్పటికే ఐదారు వందలు నిర్మాణం పూర్తయినయి. హల్దీవాగు, కూడవెళ్లి, మంజీరావాగు, నిజామాబాద్ జిల్లాలో పెద్దవాగు, కప్పలవాగు మీద చెక్డ్యామ్లు కట్టినం. మా ఎమ్మెల్యేలు నిలబడి చెక్డ్యామ్లు కట్టిచ్చారు. నీళ్లు కాల్వలకే ఇస్తం. వాగులకెట్ల ఇస్తమని ఇంజినీర్లు, ఐఏఎస్లు అంటరు. వాళ్లకు తెలంగాణ ఆత్మ తెలియదు. మేం పరిపాలకులం కాబట్టి తెలంగాణ ఎట్లా బతుకుతదో మాకు తెలుసు. అందుకే భూగర్భజలాలను బోర్లు ఎంత ఎత్తిపోస్తే అంత భూగర్భజలాలను రీచార్జ్చేసినం.
మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లను రెండోపంటకే తీసుకుంటాం. సెప్టెంబర్, అక్టోబర్లోనే నీళ్లు తీసుకుంటం. ఆ సమయంలో 75-100 టీఎంసీల నీళ్లు తీసుకుంటం. మల్టీస్టేజ్ లిప్టుల ద్వారా పైకి పంపింగ్ చేస్తుంటం. కాబట్టి భూగర్బజలాలు పడిపోవు. బోర్లు ఎండిపోవు. పొలాలు ఎండిపోవు. ఇగ దొరికిండ్రని పిచ్చి అదుర్దాతో కేసీఆర్ను బద్నాం చేయవచ్చని మొత్తం మేడిగడ్డ బ్యారేజీ గోల్మాల్ అన్నట్టు ప్రచారం చేస్తుండ్రు. మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక భాగం మాత్రమే. ఒక్క చిన్న ప్రాజెక్ట్ మాత్రమే. దీని వ్యయం నాలుగు నాలుగున్నర వేలు కోట్లు. ఈ ప్రాజెక్టులో 88 పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లలో ఒక్కో పిల్లర్కు 40-50కోట్లు ఖర్చవుతుంది. మూడు పిల్లర్లు సరిచేస్తే 150 కోట్లలో అయిపోతుంది. ప్రాజెక్టుకేం ప్రమాదం రాలే. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నుంచి స్వామిరెడ్డి అనే రైతు కాంగ్రెస్ దుర్మార్గులు కేవలం కేసీఆర్ను బద్నాంచేసేందుకు కాళేశ్వరం రిపేర్చేయక మన పొలాలు ఎండబెట్టిండ్రని పేపర్ల వ్యాసం రాసిండు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజ్లు. అసంపూర్తిగా ఉన్నటువంటి ఎల్లంపల్లిని, మిడ్మానేరును పూర్తి చేయడం. ఇది మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం. 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి. 9 సర్జుపూల్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చిన సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ అని, ల్యాండ్మార్క్ అని ప్రశంసించారు. ప్రాజెక్టుకు లోన్ ఇచ్చినటువంటి ఆర్ఈసీ ప్రాజెక్టుకు ‘ఏ’ గ్రేడ్ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. హైకోర్టు అప్పటి సీజేఐ రాఘవేంద్రసింగ్ చౌహాన్ మరో ఐదారుగురు జడ్జీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. నందిమేడారం పంప్హౌస్ను చూసిన ఆయన ఆశ్చర్యపోయి హైదరాబాద్కు వచ్చి ‘కేసీఆర్ గారు మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. మాకు హైకోర్టు భవనం కట్టించండి’ అని అడిగారు.
కేసీఆర్: మేం కాదు, ప్రజలే చెప్తున్నరు. ఐదేండ్లు ప్రజలు కాళేశ్వరం ఫలితాలు పొందిడ్రు. ఒకప్పుడు 40-50 టన్నుల వడ్లు పండించిన తెలంగాణ మూడున్నర కోట్ల టన్నులు ఎట్ల పండిచ్చింది? ఇది కాళేశ్వరం పుణ్యం కాకపోతే. లెట్ ది కాంగ్రెస్ ఆన్సర్ ది పీపుల్? ఊరికే ఇష్టమొచ్చిట్లు మాట్లాడతామంటే కుదరదు. మూడున్నర కోట్ల టన్నుల వడ్లు పండిన మాట నిజమా? కాదా? మేం పండించిన పంటను అసమర్థ నరేంద్రమోదీ ప్రభుత్వం కొనకపోతే, ఎఫ్సీఐ తీసుకోక మొండికేస్తే తెలంగాణ క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నాచేయలేదా?
కేసీఆర్: ఇటీవలే ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో గంగానది మీద బ్రిడ్జి కడుతుంటే బ్రిడ్జి కూలిపోయింది. బీహార్లో బ్రిడ్జి కూలిపోయింది. నదుల్లో, ఇసుకలో కట్టే ప్రాజెక్ట్లు కొట్టుకుపోతాయి. అమెరికాలో గతంలో హోవర్ డ్యామ్ కూలిపోయింది. మళ్లీ కట్టుకున్నారు. కడెం డ్యామ్ కొట్టుకుపోయింది. నాగార్జునసాగర్ కట్టిన తర్వాత కుడివైపు కూలిపోయింది. మళ్లీ సరిచేశారు. మిడ్మానేరు ప్రాజెక్ట్ను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తమ్ముడు కట్టిండు. ఒకటే వానకు కొట్టుకుపోయింది. ఆయన్ను జైలులో వేసినమా? కేసుపెట్టినమా? కట్టినప్పుడు జియాలజీ వాళ్లు టెస్టులు చేయలేదేమో, ఇంకోచోట కింద లీకేజీ ఏర్పడింది. దాన్ని మేం సరిచేసినం. తెలంగాణకు నీళ్లు రావాలె. పచ్చటిపంటలు పండాలె. ప్రజలు బతకాలన్నదే మా జిద్దు. మేం కాంగ్రెస్లా చిల్లర రాజకీయాలు చేయలే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న తొందరలో ప్రజల మీదున్న ప్రేమతో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించినోళ్లం కాబట్టి, ఉద్యమం చేసినోళ్లం కాబట్టి నీళ్లు తేవాలని తెచ్చినం. ఇచ్చినం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాన్నిచ్చింది కదా! మూడున్నరకోట్ల టన్నుల పంటపండింది కదా. విజయవంతమైంది కదా.
జావాబు: ఇదంతా బ్లఫ్. ఈ కాకిలెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు. తెలంగాణకు నీళ్లు ఇచ్చే ఒక వనరు గోదావరి. మేము కష్టపడి మేధోమథనం చేసి బ్రహ్మాండంగా కాళేశ్వరాన్ని తీసుకొచ్చాం. ఒక చిన్న లోపం జరిగింది. ఒక పన్ను ఊడితే.. మొత్తం 32 పండ్లు ఊడగొట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఈ దెబ్బ కనిపిస్తది.
జవాబు: కాళేశ్వరంలో ఉన్న ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 11 పిల్లర్లు ఉన్నాయి. వాటిల్లో రెండో మూడో క్రాక్ అయ్యాయి. ఆ బ్లాక్ మొత్తానికి సింగిల్ ర్యాఫ్ట్ తీసేసి కట్టాలన్నా ఖర్చు అయ్యేది రూ.400 నుంచి రూ.500 కోట్లే. మీరు చెయ్యకపోయినా మీ పరువు పోతది. ఒకవేళ కొట్టుకుపోవాలంటే మొత్తం పోదు.. ఆ ఒక్కబ్లాకే కొట్టుకుపోతుంది. అప్పుడూ మీ పరువే .
కేసీఆర్: మేం కాదు, ప్రజలే చెప్తున్నరు. ఐదేండ్లు ప్రజలు కాళేశ్వరం ఫలితాలు పొందిడ్రు. ఒకప్పుడు 40-50 టన్నుల వడ్లు పండించిన తెలంగాణ మూడున్నర కోట్ల టన్నులు ఎట్ల పండిచ్చింది? ఇది కాళేశ్వరం పుణ్యం కాకపోతే. లెట్ ది కాంగ్రెస్ ఆన్సర్ ది పీపుల్? ఊరికే ఇష్టమొచ్చిట్లు మాట్లాడతామంటే కుదరదు. మూడున్నర కోట్ల టన్నుల వడ్లు పండిన మాట నిజమా? కాదా? మేం పండించిన పంటను అసమర్థ నరేంద్రమోదీ ప్రభుత్వం కొనకపోతే, ఎఫ్సీఐ తీసుకోక మొండికేస్తే తెలంగాణ క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నాచేయలేదా?
కేసీఆర్: రబ్బిష్. మొత్తం 30-40లక్షల ఎకరాలు కాళేశ్వరంతోనే సాగవుతున్నది. కాళేశ్వరం లేకపోతే శ్రీరాంసాగర్ స్టేజ్-2 ఎక్కడుంది. తుంగతుర్తి, డోర్నకల్, సూర్యాపేట, మహబూబాబాద్కు శ్రీరాంసాగర్ నీళ్లు వచ్చినయా. పేరుకది ఎస్సారెస్పీ స్టేజ్ -2. కానీ ఎప్పుడన్నా భూపాలపల్లి, నర్సంపేట ప్రాంతాలకు ఎప్పుడన్నా నీళ్లు వచ్చాయా? వరంగల్ జిల్లాకు కడుపునిండా నీళ్లు వచ్చాయా? ఎప్పుడూ కరీంనగర్ జిల్లా దాటకపోయేవి.
జవాబు: ఈ మంచి ప్రశ్న అడిగినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రాణిహిత చేవెళ్లను రాజశేఖర్రెడ్డి ఎందుకు మొదలు పెట్టారు? గోదావరం నుంచి నీళ్లు చేవెళ్లకు రావాలంటే ఇదే స్కేల్తోనే మొదలు పెట్టారు కదా? కల్వకుర్తి ఎందుకు మొదలుపెట్టారు? ఎందుకంటే ప్రాధాన్యతల క్రమంలో భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకొని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టులు నిర్మి స్తాం. ఈ విషయాన్ని మేము అంసెబ్లీలో పదేపదే చెప్పాం. ప్రజలను బతికించడం కోసం, పరిశ్రమలు తీసుకురావడం కోసం, సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రాజెక్టు కట్టాం. అంతకుమించి మాకు మరే ప్రాధాన్యత లేదు. ఒక వేళ ఆ ప్రాజెక్టును కట్టకపోతే వచ్చే డబ్బులు ఏం చేయాలి? దేనికి ఖర్చు చేయాలి? ఎవరైనా ఎకనమిస్టు చెబుతురా? వారిదంతా బుర్రతక్కువ ఆలోచన. మళ్లీ బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు రావాలె, రైతులు భిక్షగాళ్లలాగ ఉండాలె, తెలంగాణ ఎడారిలాగ ఉండాలి, వలసలు పోవాలనేది ఈ ప్రభుత్వ ఆలోచనా? 60వేల కోట్లతో మొదలైన బడ్జెట్.. 3 లక్షల కోట్లకు బడ్జెట్ను ఎలా తీసుకొచ్చాం? దానిని పూర్తిస్థాయిలో వాడితేనే కదా.. దాని లాభాలు తెలిసేది. సీడబ్ల్యూసీ చైర్మన్గా కాళేశ్వరాన్ని సందర్శించి.. తన ఇంజినీర్లను పంపిస్తాం.. వారికి మంచి శిక్షణ దొరుకుతుందని నాకు ఆయన చెప్పారు
జవాబు: ప్రభుత్వం ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ మంచిని ఒప్పుకోవాలి. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తాం అనే బదులు.. మేము చేసిన మంచి పనులను గుర్తిస్తే సరిపోతుంది. ఆ నాడు వైఎస్ హయాంలో కొనసాగిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాం. అసెంబ్లీనే నేను స్వయంగా ఒప్పుకున్నా. కనీసం పేరు కూడా మార్చబోమని చెప్పా. వీటితోపాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, బస్తీదావఖానా, పల్లె దావఖానా పెట్టాం. మాకంటే ఎక్కువ చేయాలి కానీ దిగజారకూడదు.
జవాబు: కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్ మాత్రమే. జరిగింది చాలా చాలా చిన్న క్రాక్ మాత్రమే. దాన్ని బూతద్దంలో చూడొద్దు. కొత్తగా కట్టిన ప్రాజెక్టులు సెటిల్ అవుతుంటే కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించాల్సిందే. శ్రీశైలంలో కూ డా చేశారు. దేశంలో అన్ని చోట్లా చేస్తారు. కేసీఆర్ను బద్నాం చేద్దామనే ప్రయత్నం ఆపాలి. లేకపోతే ప్రభు త్వం వదిలేస్తే ఊరుకోం. ఇది ప్రజాయుగం. ప్రజలే పోయి దాన్ని నిర్మించుకుంటారు.
జవాబు: ఇది ఒక్క కాళేశ్వరానికి సంబంధించిన అంశం కాదు. తెలంగాణ నదులు, నీళ్లు ఇలా అన్నింటికి సంబంధించినది. మనకు ఉండేవి రెండే రెండు నదులు ఒకటి గోదావరి, మరొకటి కృష్ణానది. ఉమ్మడి పాలనలో సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపారు. చేస్తమని చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇక తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండాకు జడిసి రెండోదశ ప్రారంభించామని చెప్పి అక్కడింత ఇక్కడింత చేశారు. దేవాదులు పూర్తికాలేదు, నెట్టెంపాడు పూర్తికాలేదు. బీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ఇలా ఏదీ పూర్తికాలేదు. ఎల్లంపల్లి పూర్తికాలేదు, మిడ్ మానేరు పూర్తికాలేదు.. అన్నీ అసంపూర్తే. ఇక తెలంగాణ వచ్చింది మేం అధికారంలోకి వచ్చాం. తెలంగాణకు ఎత్తిపోతలే తప్ప మరో గత్యంతరం లేదనేది సత్యం. తెలంగాణ భౌగోళిక వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. తెలంగాణ రెండు బేసిన్లుగా ఉంటుంది. కృష్ణా, గోదావరి బేసిన్లుగా ఉంటుంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన గోదావరి తెలంగాణలో కందకుర్తి గ్రామం వద్ద కలుస్తుంది. ఇది మంజీర, గోదావరి నదులు కలిసే ప్రదేశం. ఇక్కడ 323 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
మేడిగడ్డ బ్యారేజీ(కాళేశ్వరం ప్రాజెక్టు) 85 మీటర్ల ఎత్తులో, సమ్మక్క బ్యారేజ్ వద్ద 70 మీటర్లు, సీతమ్మ సాగర్ 47 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఎంత పెద్దగా ఉంటదంటే.. దీన్ని ‘గ్యాంజెస్ ఆఫ్ ది సౌత్’ గా పిలుస్తారు. 3,00,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది దాదాపు 7.70 కోట్ల ఎకరాలకు సమానం. ఇంత ప్రాంతంలో కురిసే వర్షం ఈ నదికి వస్తుంది. 1974లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు బచావత్ గారు సబ్ డివిజన్ మాదిరిగా తీసుకుని నీళ్లు పంపిణీ చేశారు. పలానా సబ్ డివిజన్ వరకు మహారాష్ట్రకు, మరో సబ్ డివిజన్ వరకు మధ్యప్రదేశ్కు, కర్ణాటక, ఒడిశాకు సబ్ డివిజన్ల వారీగా నీళ్లు కేటాయించారు. మిగిలిన నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని చెప్పారు. దీనిపై సుమారు 1500 టీఎంసీలు ఉంటాయని లెక్కకట్టారు. దీని కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ నీళ్లు ఎక్కడ ఉంటాయంటే.. గోదావరి నదికి మూడు ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయి. ప్రాణహిత పెద్ద ఉపనది.
ఆ తర్వాత ఇంద్రావతి, ఆ తర్వాత శబరి. ఇందులో 1700 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే నది ప్రాణహిత. 650-700 టీఎంసీల నీళ్లు ఇంద్రావతిలో, 400-600 టీఎంసీల నీళ్లు తెచ్చేది శబరి. ఇందులో శబరి ఆంధ్రప్రాంతంలోని పోలవరానికి ఉపయోగపడుతుంది. ఇక తెలంగాణకు ఉన్న అవకాశం ఇంద్రావతి లేదా ప్రాణహిత. ఇంద్రావతిలో వరద ఒకేసారి వేగంగా వస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. ఇక ఏకైక జీవనది ప్రాణహిత. అసలు ప్రాణహిత లేకుంటే గోదావరి నదే లేదు. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్రాణహిత నుంచి మాత్రమే. సమైక్య పాలకులు కేటాయించిన 968 టీఎంసీలు వాడుకోవాలంటే ప్రాణహిత మాత్రమే అవకాశం. గోదావరి బేసిన్లో హయ్యెస్ట్ పాయింట్ 680 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ నిర్మించినం. 85 మీటర్ల నుంచి 680 మీటర్లకు రావాలి.. ఇది గోదావరి కథ. ఇక కృష్ణ… కృష్ణలో శ్రీశైలం నుంచి తీసుకోవాలి. కృష్ణ బేసిన్లో హయ్యెస్ట్ పాయింట్ లక్ష్మీదేవిపల్లి గ్రామం. ఇది 670 మీటర్ల ఎత్తు. తెలంగాణలో పాలించిన కాకతీయులు పుణ్యాత్ములు… వాళ్లకు ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ పరిస్థితిని గమనించి 75వేలకు పైగా చెరువులను నిర్మించారు.
ఆ తర్వాత వచ్చిన కుతుబ్షాలు, నిజాంలు కూడా ఆ పరంపర కొనసాగించారు. అసలు తెలంగాణ జీవిత ఆధారమే ఆ చెరువులు. సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి మైనర్ ఇరిగేషన్ అని పేరుపెట్టి.. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ ఇచ్చేవారు కాదు. దీన్ని మొత్తం ధ్వంసం చేశారు. చెరువులు మొత్తం తాంబాలాలుగా మారిపోయాయి. తూంలు కూలిపోయాయి. చెరువుల ఉనికే కోల్పోయింది. దీంతో తెలంగాణలో భూగర్భ జలాలు పడిపోయాయి. 500-800 ఫీట్లు బోర్ వేస్తేగానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు నీళ్లు కావాలి. ఏం చేయాలి. ఎత్తిపోతలను కేసీఆర్ తలపెట్టలేదు. సమైఖ్య పాలకులే దీనికి నాంది పలికారు. మాజీ సీఎం రాజశేఖర్రెడ్డి కావచ్చు, కిరణ్కుమార్రెడ్డి కావొచ్చు ప్రాణహిత చేవెళ్ల, కాంతనపల్లి, దేవాదుల పేరుపై ఎత్తిపోతల పథకాలను ఇచ్చారు. కృష్ణాపై కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు పేరుతో ఇచ్చారు. నీళ్లు తీసుకొని ఎత్తులోకి తీసుకురావాలి.
జవాబు: కేఆర్ఎంబీని మేము దద్దరిల్లిచ్చాం. ‘మా రెండు రాష్ర్టాల మధ్య నువ్వొక సమన్వయ కర్తవు మాత్రమే. నువ్ మాకు బాస్వు కాదు. బీకేర్ఫుల్’ అని చెప్పాం. ప్రాజెక్టులు అప్పగించమంటే మేము అప్పగించలేదు. వీళ్లు పోయి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారు. నేను గొడవ చేస్తే అసెంబ్లీ ఎజెండా పక్కకు పెట్టి మళ్లీ రెజుల్యూషన్ పెట్టారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. నిన్నటికినిన్న గోదావరి కింద ఉన్న టెయిల్పాండ్లో ఏపీ ప్రభుత్వం దురాక్రమణ చేసి నీళ్లు ఎత్తుకుపోయింది. వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా? ఏం చేస్తున్నారు? గుడ్లు అప్పగించి చూస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. అందుకే అసమర్థ, అవివేక, ఉన్న వసతులు వాడుకోలేని అర్భక ప్రభుత్వం ఇది. మిషన్ భగీరథ ఇంటేక్ పాయింట్ అది. అది ఖాళీ అయితే నీళ్లు ఎక్కడ్నుంచి ఇవ్వాలి.
సందర్శించాం. చాలా ప్రణాళికా బద్ధంగా నిర్మించారు. నాణ్యతతో కూడిన పనులు జరిగాయి. తెలంగాణకు ఇదొక లాండ్మార్క్ ప్రాజెక్ట్. నేను ఈ ప్రాజెక్టును సందర్శించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇదొక పెద్ద ప్రాజెక్ట్, చాలా చాలెంజింగ్ ప్రాజెక్ట్. శాస్త్ర, సాంకేతికంగా,నాణ్యమైన పద్ధతిలో నిర్మాణం జరిగింది.
-సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ మసూద