KCR : కేసీఆర్ రథం ఎక్కంగనే రాష్ట్రంలో ప్రభుత్వానికి దెయ్యం వదిలిందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అన్నారు. కేసీఆర్ బస్సెక్కి గర్జన జెయ్యంగనే దెబ్బకు దెయ్యం వదిలి బంద్వెట్టిన రైతుబంధు మళ్ల ఏస్తున్నరని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం రాత్రి నిజామాబాద్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
‘ఇన్నాళ్లు బంధువెట్టిన రైతుబంధును మళ్ల ఇయ్యాల మొదలువెట్టిండ్రు. మరె ఇన్నాళ్లు బంధువెట్టి ఇప్పుడెందుకు ఏస్తున్నరు..? కేసీఆర్ రథం ఎక్కంగనే దెబ్బకు దెయ్యం వదిలింది. కేసీఆర్ బస్సెక్కి గర్జణ చేసిండు కాబట్టి రైతుబంధు పడుతున్నది. పోరాడితే తప్ప ఏదీ జరగదు. అందుకే మీకు చెప్తున్న.. తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గళం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇయ్యాల బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తెనే దెయ్యం వదిలి, ముఖ్యమంత్రికి వణుకుడువెట్టి రైతుబంధు ఏస్తున్నడు’ అని కేసీఆర్ అన్నారు.
‘ఇప్పుడు రైతుబంధు ఏస్తున్నరు కానీ ముందుముందు దెబ్బపెడతరు గ్యారంటిగ. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఎయ్యరట. ఎందుకు ఆరెకరాలు ఉన్నోళ్లు ఏం పాపం చేసిండ్రు..? ఏడెకరాలోళ్లు ఏం పాపం జేసిండ్రు..? వాళ్లకు రైతుబంధు ఎయ్యరట. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నింటిని అమలు చేయించాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలె. బీఆర్ఎస్కు శక్తి ఉంటెనే తెలంగాణకు శక్తి ఉంటది’ అని కేసీఆర్ చెప్పారు.