హైదరాబాద్,మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లో రాష్ట్ర కోడ్ను టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29-ఏ, టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించారు.