హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC election) ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి ప్రజల పక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలన్నారు.
తద్వారా కేవలం పట్టభద్రుల సమస్యలే కాకుండా సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతారని నాగేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.