Karnataka | బెంగళూరు: కర్ణాటకలో రైతు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం లోక్సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తా న్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రైతులకు చేసిందేమీ లేదని, ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లే దనే భావనతో పలు రైతు సంఘాలు ఉ న్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సంఘటితం చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్ 3న రైతు సం ఘాల సమావేశం జరగనునుంది. ఈ సమావేశంలోనే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నో టాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చా యి. దీని పై ఏప్రిల్ 3న తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.