హుజూరాబాద్టౌన్, మార్చి 8: మహిళా దినోత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. కేసీఆర్ మహిళా బంధు సంబురాల్లో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. హుజూరాబాద్ డివిజన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధికాశ్రీనివాస్ను సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రుద్రారపు అనిల్కుమార్, ఉపాధ్యక్షుడు సతీశ్, చైర్మన్ అహ్మద్ పాషా, ప్రధాన కార్యదర్శి భాసర్, సహాయ కార్యదర్శి వీ కిరణ్గౌడ్, వరింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, క్యాషియర్ బోధ వెంకట్, జాయింట్ సెక్రటరీ రాజన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ అండ్ వరర్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
హుజూరాబాద్లోని నియోజకవర్గ లీగల్ సెల్ ఆఫీసులో జిల్లా లీగల్ సెల్ సభ్యులు కాల్వల సరిత, మిడిదొడ్డి స్వప్నను లీగల్ సెల్ నిర్వాహకులు సంధ్యాల వెంకన్న, చల్లురి రాజు తదితరులు సన్మానించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), బాలుర పాఠశాలల్లో ఇన్చార్జి హెచ్ఎంలు ఎర్రబెల్లి స్వామిరావు, సానె అనురాధ అధ్యక్షతన మహిళా దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని మాతృశ్రీ డిగ్రీ, పీజీ కళాశాలలో మహిళా అధ్యాపకులను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి, ప్రిన్సిపాల్ వీ రామారావు, అకడమిక్ డైరెక్టర్ మహిపాల్రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. హుజూరాబాద్ పోలీస్స్టేషన్లో మహిళా హోంగార్డ్ అధికారి ఎం సౌజన్యను సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రాజన్న, ఆసిఫ్, చీనానాయక్, తదితరులు శాలువాతో సన్మానించారు.
మహిళా ప్రయాణికులకు సన్మానం
సీజనల్ టికెట్పై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు ఎస్ కల్పన (శంకరపట్నం), వీ ఉమాదేవి (సైదాపూర్)ని మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం హుజూరాబాద్ బస్టాండ్ ఆవరణలో సంస్థ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ పీ రజినీకృష్ణ, డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఎల్ సారయ్య, ఆఫీసు సూపరింటెండెంట్ రాములు, బస్టాండ్ మేనేజర్ ఆర్ఆర్ రెడ్డి, కంట్రోలర్ వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్గౌడ్, డిపో కేపీఎల్ ఇన్చార్జి కుడికాల అశోక్బాబు, కండక్టర్ మార్త రవీందర్, రిటైర్డు ఉద్యోగి బత్తుల సంజీవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్ , మార్చి 8: పట్టణంలోని 23వ వార్డులో గల అడ్తిదారుల సంఘ భవనంలో వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్ హాజరై 200 మంది మహిళలను శాలువాలతో సన్మానించారు. వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సర్పంచ్ బోయిని రాజ్కుమార్, ఉపసర్పంచ్ పీ శ్రీనివాస్రావు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రత్యూషరెడ్డి, అంగన్వాడీ ఆశ కార్యకర్తలు వసంత, సువర్ణ, వీవో అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, మహిళా వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఇక్కడ కారోబార్ సాంబయ్యతోపాటు గ్రామస్తులు ఉన్నారు.
‘న్యూ మిలీనియం’లో..
జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ప్లే స్కూల్లో పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని రంగాల్లో హాజరుకావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు ఎంపీపీని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరుణ్రెడ్డి, ఉపాధ్యాయులు లావణ్య, రాధిక, గౌరి, మినాహజ్, మాధవి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సన్మానం
హుజూరాబాద్ రూరల్, మార్చి 8: మండలంలోని పలు గ్రామాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తుమ్మనపల్లిలో సర్పంచ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడూరి ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీ రాజేశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సుష్మను మహిళా వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే మహిళా వార్డు సభ్యులు, ఏఎన్ఎం, సమాఖ్య మండలి అధ్యక్షురాలు, సీఏలు, ఆశ కార్యకర్తలను శాలువాలతో సత్కరించారు. సింగాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ యువ నాయకుడు వొడితల ప్రణవ్బాబు ఆధ్వర్యంలో సర్పంచ్ మంజుల, మహిళా వార్డు సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఏకశిల పాఠశాలలో..
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని ఏకశిల సీబీఎస్సీ పాఠశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. స్వీట్లు పంచారు. మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సువిజాతిరుపతిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, మహిళా ఉపాధ్యాయులు పద్మ, నాగమణి, నిజామున్నీసా, శృతి, సరిత, సునీత, ప్రశాంతి, ఉమాదేవి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
వీణవంక, మార్చి 8: ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో జీవనజ్యోతి ఐకేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఘన్ముక్లలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ సర్పంచ్ సునీత, ఫ్రంట్లైన్ వారియర్స్ ఏఎన్ఎంలు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల సీఏలను, మహిళా గ్రూప్ లీడర్లను ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, తిరుపతి, రాజశేఖర్, రవి, బల్వీర్సింగ్, రాజ్కుమార్, ఏపీఎం కొమురయ్య, సీసీలు సుకాసి తిరుపతి, సూరోజు ఘనశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.