ముత్తారం, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు చెలుకల లింగభావానీసుధీర్ తెలిపారు. ఆమె తన అనుచరులతో గు రువారం ముత్తారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధి పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని, ఈ పథకాలతో పాటు సీఎం కేసీఆర్, జడ్పీ చైర్మన్ పుట్ట మదన్నతోనే ముత్తారం అభివృద్ధి చెందుతున్నదన్నారు. మదన్న సమక్షంలో తన అనుచరులతో కలిసి త్వరలోనే టీ(బీ)ఆర్ఎస్ సార్టీలో చేరనున్నట్లు ఆమె తెలిపారు. మంథని నియోజవర్గంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. పుట్ట మదన్నతోనే మంథని నియోజకవర్గంతోపాటు ముత్తారం మండలం కూడా అభివృద్ధి చెందుతున్నదన్నారు. తనతో పాటు త్వరలోనే ముత్తారం మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో టీ(బీ)ఆర్ఎస్లో చేరతారని వెల్లడించారు. వారి వెంట నాయకులు చెలుకల సుధీర్, చెలకల ఓదెలు, ఒల్లపు మొగిలి, దిశేందర్, చింతల మొగిలి, సల్ల రాజేంద్రం, కనకయ్య, ఉప్పు భూ షణం, ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.