హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని ధారపోసిన జ్యోతిబాఫూలే 196 జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, పెద్ద ఎత్తున ప్రజలు హాజరై జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.