నల్లగొండ : అట్టడుగున ఉన్న మన జీవితాల్లో వెలుగులు నింపేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఆదివారం బాజకుంట గ్రామంలోని వివిధ పార్టీకలకు చెందిన పలు కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్ పల్లి పట్టణంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుపెన్నడు ఏ ప్రభుత్వాలు చెయ్యని విధంగా సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.
పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నదని కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు, ఆశయాలకు మనమంతా అండగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.