హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన జాబ్మేళాలో 2 వేల మంది విద్యార్థులకుపైగా ఉద్యోగాలు లభించాయి. మేళాకు సుమారు 20 వేల మం ది ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకున్నారని వీసీ కట్టా నరసింహారెడ్డి చెప్పారు. ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు రావడం రికార్డని తెలిపారు. జాబ్మేళాలో మైక్రోసాఫ్ట్, విప్రో, టెక్మహీంద్రా, ఇంటెల్, ఏజీఎస్ హెల్త్ వం టి 39 కంపెనీలు ఉద్యోగులను తీసుకున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మం జూర్ హుస్సేన్, వర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ తారా కల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జే సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.