ఎల్బీనగర్, మే 12: ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి డిమాండ్ చేశారు. దిల్సుఖ్నగర్లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు దాటినా కనీసం నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమన్నారు.
బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుక్యా కుమార్, నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను అన్ని విధాలుగా వాడుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రభు త్వం కల్లబొల్లి మాటాలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ నాయకులు షింబు నాయక్, బాల కోటి, నవీన్ పట్నాయక్, శంకర్, ఉపేందర్, అశోక్, రాంచంద్రారెడ్డి, సత్య, సరస్వతి, అనితతో పాటుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, గండి సన్నియాదవ్, రమణారెడ్డి, సొంటి చంద్రశేఖర్రెడ్డి, ప్రతీక్, విజయలక్ష్మి, శైలజ పాల్గొన్నారు.