ముంబై: జియో 5జీ సేవల గురించి రిలయన్స్ జియో ఇవాళ ప్రకటన చేసింది. దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
డిసెంబర్ 23వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతోందని, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో జియో దూసుకువెళ్తోందని, 5జీతో సుమారు వంద మిలియన్ల ఇండ్లను కనెక్ట్ అవుతామని ముకేశ్ తెలిపారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో తొలుత జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. అన్ని పట్టణాలు, తాలూకాలు, తహశీల్లకు డిసెంబర్ 2023 నాటికి 5జీ సేవలు అందనున్నట్లు ఆయన వెల్లడించారు.