భూపాలపల్లి, మార్చి 31: భూపాలపల్లి జిల్లాలో ఏఆర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సదానందరెడ్డి బుధవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదానందరెడ్డి 1991లో హైదరాబాద్ సీటీ అర్ముడ్ రిజర్వు సబ్ ఇన్సెక్టర్(ఆర్ఎస్ఐ)గా పోలీస్ శాఖలో చేరారు. 2019లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులుతోపాటు జిల్లా పోలీస్ అధికారులు సదానందరెడ్డిని గజమాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ సదానందరెడ్డి విధినిర్వహణలో నిజాయితీగా పనిచేశారని, సేవాభావం ఎక్కువగా ఉన్నవ్యక్తి అని కొనియాడారు. అనంతరం సదానందరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ కోసమే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని, విద్యా వ్యవస్థలో మంచి మార్పు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీపీవో ఏవో అయూబ్, సూపరింటెండెంట్ యుగేందర్, ఆర్ఐలు సతీశ్ చక్రవర్తి సీఐ వేణు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం నేత శోభన్, సిబ్బంది పాల్గొన్నారు.