IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో టీమిండియా తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (209: 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగినప్పటికీ టెయిలెండర్లు చేతులెత్తేయడంతో 396 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్స్టర్ కెరీర్తో తొలి ద్విశతకం సాధించాడు.
ఆ కాసేటికే అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అప్పటికీ భారత్ స్కోర్ 383. ఆ తర్వాత బషీర్, రెహాన్ అహ్మద్ దెబ్బతో మరో 16 పరుగులకే రోహిత్ సేన కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహాన్ అహ్మద్లు తలా మూడేసి వికెట్లు తీశారు.
📸 📸 In Pics!
That 2⃣0⃣0⃣ Moment!
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/QsJO7tUTiH
— BCCI (@BCCI) February 3, 2024
తొలి సెషన్లో అండర్సన్ అశ్విన్(20) ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన యశస్వీ 191 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి డబుల్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్(6 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. అయితే.. అండర్సన్ ఊరించే బంతితో యశస్వీని బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.