న్యూఢిల్లీ : ఢిల్లీలో రామనవమి ర్యాలీ సందర్భంగా జహంగీర్పురిలో జరిగిన హింసాకాండలో ప్రధాన కుట్రదారు ఫరీద్ను ఢిల్లీ పోలీసులు పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. ఊరేగింపుపై కాల్పులు జరిపిన ఫరూక్ ఆ ప్రాంతంలో అల్లర్లు జరిగేందుకు తొలుత ప్రేరేపించాడు. కాల్పులు జరిపిన అనంతరం ఫరూక్ పశ్చిమ బెంగాల్కు పారిపోయాడు. ఈ అల్లర్లకు సంబంధించి అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.
ఇక ఇదే కేసులో ప్రత్యేక సెల్ మరో నిందితుడిని అరెస్ట్ చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హనుమాన్ జయంతి ఊరేగింపు సాగుతుండగా ఏప్రిల్ 16న జహంగీర్పురిలో అల్లర్లు చెలరేగడంతో ఎనిమిది మంది పోలీసులు సహో ఓ స్ధానికుడు గాయపడ్డారు. ఘర్షణల్లో పలు వాహనాలకు నిప్పంటించడంతో పాటు అల్లరి మూకలు రాళ్ల విసురుతూ విరుచుకుపడ్డాయి.
ఈ కేసులో ఇప్పటివరకూ తాజా అరెస్టులతో పట్టుబడిన వారి సంఖ్య 30 మందికి చేరింది. గురువారం అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను జహంగిర్పురికి చెందిన జాఫర్ (34), బబుద్దిన్ (43) గా గుర్తించారు. అల్లర్లలో వీరిద్దరూ చురుకుగా పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు. హింసాకాండ జరిగిన సమయంలో జాఫర్ కత్తితో గుంపుల మధ్య తిరిగినట్టు సీసీటీవీ కెమెరా, మొబైల్ వీడియోల ఫుటేజ్లో కనిపించిందని తెలిపారు.