అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఫెయిల్యూర్ అనడం క్షమించరానిదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయడం తప్పదని అన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో అప్పులు చేయలేదా.. తాము కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. 2019లో సీఎం జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన వ్యాఖ్యలపై మోపిదేవి తీవ్రంగా స్పందించారు.