– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి
బూర్గంపహాడ్, మార్చి 31 : ఐటీసీ కర్మాగారంలో శ్రమను నమ్ముకుని పని చేస్తున్న కార్మికుల సమస్యలంటే ఐటీసీ యాజమాన్యానికి పట్టింపు లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎస్కే.యాకూబ్పాషా అన్నారు. ఐటీసీ ఎదుట గత 6 రోజులుగా కార్మిక హక్కులను కాపాడాలని, సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కార్మికుల ఇబ్బందులను కనీసం గుర్తించడం లేదని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఎంతవరకైనా తీసుకుపోతామని వారు హెచ్చరించారు. 6వ రోజు దీక్షలో కాంట్రాక్టు కార్మికులు దారా రాము, ఈతకోటి జాన్సన్, చామకూరి నవీన్ కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వార్డు మెంబర్ కొమరం సావిత్రి సంఘీభావం తెలిపి కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ రిలే దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు సింగారపు సతీశ్, కందాల వెంకటరెడ్డిలతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.