ముంబై, జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ షేర్ మరో నెలరోజుల పాటు రూ.15వేల వద్ద ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.1650 టార్గెట్గా,రూ.1450 స్టాప్ లాస్గా పేర్కొంటున్నారు. టీసీఎస్ టార్గెట్ రూ.4,400 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.