భారత- ‘ఎ’ జట్టుకు ఎంపిక
కోల్కతా: యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ను దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టులో చేర్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడిన వీరిద్దరూ.. మంగళవారం ‘ఎ’ జట్టుతో చేరుతారని బోర్డు అధికారి తెలిపారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న నాలుగు రోజుల టెస్టుల కోసం ప్రకటించిన భారత-‘ఎ’ జట్టులో ఒకే వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో సెలెక్టర్లు ఇషాన్ను అక్కడికి పంపనున్నారు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ ఫర్వాలేదనిపిస్తున్న దీపక్ చాహర్ను సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం గడించేందుకు ఎంపిక చేసినట్లు సమాచారం. ‘అవును.. దీపక్, ఇషాన్ టీమ్ఇండియాను వీడి మంగళవారం భారత-‘ఎ’ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్తారు’ అని ఓ అధికారి తెలిపారు.