ముంబై: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు మిగితా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో సూర్యకుమార్ ఎడమ మోచేతికి గాయమైంది. సూర్యకుమార్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుందని ముంబై ఇండియన్స్ జట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వెస్టిండీస్తో టీ20 సిరీస్లో గాయపడ్డ సూర్యకుమార్.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొంది కాస్త ఆలస్యంగా లీగ్లో అడుగుపెట్టాడు. తాజా సీజన్లో 43.29 సగటుతో 303 పరుగులు చేసిన సూర్యకుమార్ గాయం.. ఇటు ముంబై ఇండియన్స్తో పాటు అటు టీమ్ఇండియాను కలవర పెడుతున్నది.