టీమ్ఇండియా యువ పేసర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. విండీస్తో ఆఖరి మ్యాచ్లో చాహర్ కండరాల గాయానికి గురయ్యాడు. రెండు వికెట్లు పడగొట్టి మంచి జోరు మీదున్న తరుణంలో ఒక్కసారిగా రనప్ మధ్యలోనే ఆగిపోయాడు. ఇదిలా ఉంటే గాయానికి సంబంధించిన తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. ఒక వేళ గ్రేడ్వన్ టీయర్ అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుంది. దీంతో ఈనెల 24 నుంచి శ్రీలంకతో మొదలయ్యే టీ20 సిరీస్తో పాటు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు చాహర్ దూరమయ్యే అవకాశముంది.