Layoffs | బెంగళూరు, ఏప్రిల్ 19: దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ లేకపోవడం, కస్టమర్లు వ్యయ నియంత్రణ మంత్రం జపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ కంపెనీల్లో హెడ్కౌంట్ పడిపోవడం గమనార్హం. భారతీయ ఐటీ కంపెనీలకు గ్లోబల్ మార్కెటే కీలక ఆదాయ వనరుగా ఉన్న విషయం తెలిసిందే.