Cinema News | నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిండిపోతు దెయ్యం’ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీశౌర్య క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రేలంగి నరసింహారావు క్లాప్నిచ్చారు.
హారర్ కామెడీ కథాంశమిదని, కథలోని కొత్తదనం ఆకట్టుకుంటుందని దర్శకుడు, హీరో నరసింహ బోదాసు చెప్పారు. వినూత్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని నాయికానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహేందర్ ఎం, సంభాషణలు: శ్రీకాంత్ సాయి, నిర్మాత: శిరీష నరసింహ బోదాసు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: నరసింహ బోదాసు.