కొలంబో: ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం కొనసాగుతోందని, భారత హై కమీషనర్ 21 వేల టన్నుల ఫెర్టిలైజర్ను లంకేయులకు అందజేసినట్లు ఆ ట్వీట్లో తెలిపారు. గడిచిన నెలలో శ్రీలంకకు సుమారు 44 వేల టన్నుల ఫెర్టిలైజర్లను సరఫరా చేసింది ఇండియా. దీంతో ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని శ్రీలంకకు అందజేసింది మన దేశం.