Asia Team Championships : బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ (Badminton Asia Team Championships)లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. మలేషియాలో జరుగుతున్నఈ టోర్నీలో దేశానికి తొలి పసిడి పతకం(Gold Medal) అందించారు. ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన మొదటిసారే భారత బృందం స్వర్ణ పతకం కొల్లగొట్టడం విశేషం.
ఆదివారం థాయ్లాండ్తో జరిగిన ఫైనల్లో 3-2తో గెలుపొందింది. 17 ఏండ్ల అన్మోల్ ఖార్బ్(Anmol Kharb) సంచలన ఆటతో పొర్న్పిచా చోయకీవాంగ్ను చిత్తు చేసి భారత్కు చారిత్రాత్మక పతకాన్ని అందించింది.లీగ్ దశలోనే చైనా గోడను బద్ధలు కొట్టిన భారత షట్లర్లు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్(Hong Kong)ను చిత్తు చేశారు.
𝐖𝐄 𝐀𝐑𝐄 𝐓𝐇𝐄 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🥹🫶
🇮🇳 women’s team has created history 🥳
Proud of you 🫡👑@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BATC2024#TeamIndia #IndiaontheRise#Badminton pic.twitter.com/0woUIiCxNK
— BAI Media (@BAI_Media) February 18, 2024
ఇక కీలకమైన సెమీఫైనల్లోనూ తమ ప్రతాపం చూపిస్తూ.. జపాన్ క్రీడాకారుణులను ఓడించారు. దాంతో, బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ టోర్నీలో తొలిసారి టీమిండియా ఫైనల్లో అడగు పెట్టి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుతో పాటు గాయత్రి గోపిచంద్, ట్రెసా జాలీలు సింగిల్స్లో విజయ ఢంకా మోగించారు. సెమీస్లో కంగుతిన్న సింధు టైటిల్ పోరులో సత్తా చాటింది. సుపనింద కటెథాంగ్ను 39 నిమిషాల్లోనే 21-12, 21-12 తో చిత్తు చేసి భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపింది.
ASIAN CHAMPIONS 👑
History will remember this 🫶@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BATC2024#TeamIndia #IndiaontheRise#Badminton pic.twitter.com/QFA0uAlmEQ
— BAI Media (@BAI_Media) February 18, 2024
ఆ తర్వాత గాయత్రి, ట్రెసాలు అద్భుత విజయంతో టీమిండియా 2-0తో థాయ్లాండ్పై పై చేయి సాధించింది. ఇక విజేతను నిర్ణయించే డిసైడర్ మ్యాచ్లో యువకెరటం అన్మోల్ అసాధారణమైన ఆటతో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్న్పిచాను 21-14, 21-19తో మట్టికరిపించింది. దాంతో, ఈ టోర్నీ చరిత్రలో తొలి స్వర్ణంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.