Geetha Madhuri | టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 10న పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్టుగా గీతా మాధురి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.
గీతా మాధురి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక సీమంతం రోజు అయితే 800 మందికి అన్నదానం కూడా చేసినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. గీతాకు మొదటగా ప్రకృతి పుట్టగా.. ఈ సారి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు గీతా, నందు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవుడ్ నటుడు నందు, గీతా మాధురి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2014లో వీరి పెళ్లి జరుగగా.. 2019 పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి మగ బిడ్డకు జన్మనిచ్చారు గీతామాధురి.