లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వేవ్’కు దారితీయొచ్చని వైద్యప్రపంచంలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులోనూబ మూడు రకాలున్నయయి. బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3. ఇంగ్లండ్ లో ప్రస్తుతం విజృంభిస్తున్నది ఇందులోని రెండో రకం. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా రకం వల్ల బ్రిటన్ లాక్డౌన్ తుది దశ ఆంక్షల ఎత్తివేత కార్యక్రమం తీవ్ర విచ్ఛిన్నతను ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలైనంత త్వరగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాల మధ్యవిరామం 12 నుంచి 8 వారాలకు తగ్గించనున్నట్టు బ్రిటన్ ప్రధాని తెలిపారు. భారత్ రకం వైరస్ వేగంగా విజృంభిస్తున్న బోల్టన్, బ్లాక్ బర్న్ ప్రాంతాల్లో టీకాల కార్యక్రమంలో తోడ్పడేందుకు సైన్యాన్ని పంపిస్తున్నట్టు చెప్పారు. సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చే స్వేచ్ఛను వినియోగించుకునే ముందు ఆ ప్రాంతాలవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లల్లో ఆరుగురి వరకు సమావేశం కావొచ్చని మే 17 నుంచి లాక్ డౌన్ పాక్షిక ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. అయితే లాక్డౌన్ మొత్తంగా ఎత్తివేసేందుకు ఎంచుకున్న జూన్ 21 గడువు ఇండియా రకం వైరస్ కారణంగా దెబ్బతినవచ్చని సందేహం వ్యక్తం చేశారు. బ్రిటన్లో ఎక్కువగా కెంట్ రకం వైరస్ ఉంది. కానీ దానికన్నా ఇండియా రకం వేగంగా విస్తరిస్తున్నదని జాన్సన్ చెప్పారు. ఈ ఆందోళనల మధ్య ఓ ఆశారేఖ ఏమిటంటే భారత్ రకం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆస్ట్రజెనెకా, ఫిజర్ టీకాలకు లొంగుతుందని రుజువు కావడం.