Varun Aron : భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్(Varun Aron) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ (Jharkhand), రాజస్థాన్(Rajasthan) మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ ఎర్ర బంతి క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. దాంతో, అతడి సుదీర్ఘ కెరీర్కు తెరపడనుంది. కచ్చితత్వంతో, వేగంగా బౌలింగ్ చేసే అరోన్ టీమిండియా తరఫున 8 టెస్టులు మాత్రమే ఆడాడు.
‘నేను 2008 నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నా. వేగంగా బౌలింగ్ చేయడంతో పలు మార్లు గాయాల బారిన పడ్డాను. ఇప్పుడు కూడా ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు నా శరీరం సహకరించడం లేదనే విషయం నాకు అర్థమైంది. అందుకనే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలిన డిసైడ్ అయ్యాను. జంషెడ్పూర్లో నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడుతున్న ఈ మ్యాచ్ నాకు ఆఖరిది. నా కెరీర్ ఇక్కడే మొదలైంది. ఇక్కడే రిటైర్మెంట్ పలుకుతుండడం కొంచెం ఎమోషనల్గా అనిపిపిస్తోంది’అని 34 ఏండ్ల అరోన్ తెలిపాడు.
రిటైర్మెంట్ అనంతరం అరోన్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో భాగం కానున్నాడు. అక్కడ యువ ఫాస్ట్ బౌలర్లకు తర్ఫీదు ఇవ్వనున్నాడు. ‘ఎంఆర్ఎఫ్ వాళ్ల ‘పేస్ బౌలర్ టాలెంట్ హంట్'(Pace Bowler Talent Hunt) ప్రాజెక్టులో సభ్యుడిని. దేశవ్యాప్తంగా ఉన్న యువ పేసర్లతో కలిసి పనిచేయనున్నా. ఈ ప్రాజెక్ట్లో దాదాపు 1,500 మంది భాగమయ్యారు. తర్వాతి ప్రాజెక్టలో భాగంగా దేశమంతా తిరిగి 20 మంఇ పేసర్లను ఎంపిక చేయనున్నాం’ అని అరోన్ వెల్లడించాడు.
వరుణ్ అరోన్