IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా(Team India) భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(132), రవీంద్ర జడేజా (112)ల సెంచరీలకు తోడు.. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46) ధనాధన్ ఆడడంతో 445 పరుగులు కొట్టింది.
అనంతరం 5 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. బెన్ డకెట్(19), జాక్ క్రాలే(6)లు బజ్ బాల్ ఆటతో చెలరేగగా.. స్టోక్స్ సేన టీ సమయానికి 31 రన్స్ చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 441 పరుగులు వెనకబడి ఉంది.
Innings Break!
A solid batting performance from #TeamIndia to post 4⃣4⃣5⃣ on the board! 💪 💪
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/jNltRFg5FN
— BCCI (@BCCI) February 16, 2024
ఓవర్నైట్ 3265తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. నైట్వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (4)ను అండర్సన్ బోల్తా కొట్టించగా.. లోకల్ బాయ్ రవీంద్ర జడేజా(112)ను రిటర్న్ క్యాచ్తో రూట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(37) అరంగేట్రం కుర్రాడు ధ్రువ్ జురెల్(46) సమయోచితంగా ఆడారు. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్కు57 పరుగులు జోడించారు. ఆ తర్వాత సిరాజ్, బుమ్రాలు పదో వికెట్కు 30 రన్స్ జోడించడంతో టీమిండియా 445 పరుగుల చేయగలిగింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Mark Wood justifies his selection with a good showing on a batting-friendly surface #INDvENG
▶️ https://t.co/uNRzS8Vrgx pic.twitter.com/5af9p1Oj95
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024
రాజ్కోట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10), శుభ్మన్ గిల్(0), రజత్ పాటిదార్(5)లను త్వరగా కోల్పోయింది. మార్క్ వుడ్ విజృంభణకు 33 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో కెప్టెన్ రోహిత్,ర జడ్డూ సమయోచితంగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేస్తూ సెంచరీ కొట్టారు. నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించారు.
Dhruv Jurel falls four short of his fifty, he’s played his part though #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024
మరోవైపు అరంగేట్రంలోనే రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్(62) అర్ధ సెంచరీతో మెరిశాడు. అయితే.. జడేజా సింగిల్కు నిరాకరించడంతో అనూహ్యంగా రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నైట్వాచ్మన్ కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడాడు. దాంతో రోహిత్ సేన మొదటిరోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 326 రన్స్ చేసింది.