హైదరాబాద్ : ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు(POW) సంధ్య(POW Sandhya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) మృతి చెందారు. గుండెపోటు(Heart attack)తో బాధపడుతున్న రామకృష్ణారెడ్డిని హైదర్గూడ అపోలో హాస్పిటల్(Apollo Hospital)లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మరణ వార్త విన్న వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు దవాఖానకు చేరుకొని సంధ్యను ఓదార్చారు. రామకృష్ణారెడ్డికి నివాళులు అర్పించారు.