న్యూఢిల్లీ : టెక్నాలజీ రంగంలో భారత సంతతికి చెందిన టెకీలు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలను ముందుండి నడిపిస్తున్నారు. సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలకు బీజం పడేలా టెక్ దిగ్గజాలకు దిక్సూచీగా వ్యవహరిస్తూ బహుళజాతి కంపెనీల్లో బహుముఖ పాత్ర పోషిస్తున్నారు.
పలు టెక్ కంపెనీలకు భారత సంతతి సీఈవోలు నియమితులై ఆయా సంస్ధలను విజయవంతంగా నడిపిస్తున్నారు. పలు టెక్నాలజీ కంపెనీలకు భారత సంతతికి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు సీఈవోలుగా సత్తా చాటుతున్నారు. ప్రముఖ టెక్ కంపెనీలకు భారత సంతతికి చెందిన వీరంతా సీఈవోలుగా సేవలందిస్తున్నారు.
పరగ్ అగర్వాల్ : ట్విట్టర్ సీఈవో
సత్య నాదెళ్ల : మైక్రోసాఫ్ట్ సీఈవో
శంతను నారాయణ్ : అడోబ్ సీఈవో
సుందర్ పిచాయ్ : గూగుల్ సీఈవో
అరవింద్ కృష్ణ : ఐబీఎం సీఈవో
శివ శివరామ్ : వెస్ట్రన్ డిజిటల్ ప్రెసిడెంట్
అంజలి సూద్ : విమియో సీఈవో