లాసన్నె: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత హాకీ జట్లు తమ అంతర్జాతీయ ర్యాంక్లను మెరుగుపర్చుకున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో భారత పురుషుల జట్టు మూడో స్థానానికి ఎగబాకగా.. మహిళలు ఏడో ర్యాంక్కు చేరుకున్నారు. ఇటీవల జరిగిన ప్రొ లీగ్లో మూడు విజయాలు, ఒకటి ‘డ్రా’ చేసుకున్న పురుషుల జట్టు 2503 పాయింట్లతో మూడో ర్యాంక్ పొందగా.. తొలి రెండు ర్యాంకుల్లో ఆస్ట్రేలియా (2842), బెల్జియం (2763) నిలిచాయి. మహిళల ప్రొ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా 2029 పాయింట్లతో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో ఏడో ర్యాంక్లో నిలిచింది.