మిస్సోరీ: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో భారత సంతతి వ్యక్తిపై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. తర్వాత దవాఖానలో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు స్థానిక నివాసిని అరెస్ట్ చేశారు. మరణించిన వ్యక్తి పేరు షరీఫ్ రహ్మాన్ ఖాన్ అని, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ వాసి అని గుర్తించారు. ఇది ద్వేషపూరిత దాడి అని భావిస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత సెయింట్ లూయిస్ మిస్సోరీ యూనివర్సిటీ సిటీ అపార్ట్మెంట్ వద్ద బుల్లెట్ గాయాలతో పడి ఉండటం గమనించిన వారు చికిత్స కోసం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హత్యకు స్థానిక వ్యక్తి కోల్ జే మిల్లర్కు సంబంధం ఉందని నిర్ణయించుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మరణించిన భారతీయ ఇంజినీర్కు, ఆయన స్నేహితురాలికి మధ్య రోమాంటిక్ ఫిక్సేషన్ ఉందని మిల్లర్ చేసిన వ్యాఖ్య ఇద్దరి మధ్య వాగ్వాదానికి దిగారు. ఖాన్ కోపం పట్టలేక మిల్లర్ పొత్తికడుపులో గుద్దాడు ఖాన్. దీంతో ఖాన్పై మిల్లర్ 0.380 రూగర్ ఎల్సీపీ పిస్టల్తో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఖాన్ను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మారుతి సుజుకికి షాక్: డీఆర్ఐ పన్ను ఎగవేత నోటీసులు
మారుతి సుజుకికి షాక్: డీఆర్ఐ పన్ను ఎగవేత నోటీసులు
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు