కాషాయ పతాకం జాతీయ జెండాగా మారుతుంది. దీనికి వందల ఏండ్లు పట్టొచ్చు. అయితే ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. రాముడు తన రథంపై కాషాయ జెండాను పెట్టుకోలేదా? అలాగే రానున్న కాలంలో కాషాయ జెండా జాతీయ పతాకంగా మారొచ్చు కదా! అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని మేము చెప్పినప్పుడు అందరూ నవ్వారు. కానీ, ఇప్పుడు ఏం జరిగింది. అలాగే, భవిష్యత్తులో ఎర్రకోటపై కాషాయ జెండా తప్పకుండా రెపరెపలాడుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండాలను మేము ఎగురవేస్తాం. నేడో, రేపో యావత్ భారతం హిందూ దేశంగా మారబోతుంది. ప్రస్తుతానికైతే త్రివర్ణ పతాకమే మన జాతీయ జెండా. దాన్ని అవమానించిన వారెవరైనా దేశ ద్రోహుల కిందే లెక్క.
-కేఎస్ ఈశ్వరప్ప, కర్ణాటక మంత్రి, బీజేపీ నేత