న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. పాజిటివ్ కాస్త తగ్గినా.. మరో 4వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 3,44,776 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809కు చేరాయి. ఇప్పటి వరకు 2,00,79,599 బాధితులు కోరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. టీకా డ్రైవ్ గురువారం నాటికి 118వ రోజుకు చేరగా.. 17,92,98,584 ఇప్పటి వరకు డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మరో వైపు దేశంలో భారీగా టెస్టులు జరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు 18.75లక్షల టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 31.13 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది.