హైదరాబాద్ : కరోనా సోకిందని మనస్థాపానికి గురై రైతుతో పాటు ఓ యువకుడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేటలో సెల్ పాయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహునిపేట మండలం పడబటిగూడెంలో పాలబెల్లి లింగయ్య (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున తన వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. ఇద్దరి ఆత్మహత్యతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.