హరారే: జింబాబ్వేతో జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. రెండో వన్డేకు దీపక్ చాహర్ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ను తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్లో ఇండియా 1-0 తేడాతో లీడింగ్లో ఉంది. తొలి మ్యాచ్లో జింబాబ్వే టాప్ ఆర్డర్ విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల ఆ జట్టు టాపార్డర్ రాణించడంలేదు. రెండవ వన్డే కోసం జింబాబ్వే జట్టు రెండు మార్పులు చేసింది. తకువన్షే కైటనో, తనక చివాంగలు జట్టులోకి వచ్చారు. మరుమణి, రిచర్డ్లను పక్కనపెట్టేశారు.