IND vs RSA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్(Team India) కష్టాల్లో పడింది. సొంత గడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(5) తక్కువ స్కోర్కే వెనుదిరిగిన కాసేటికే శుభ్మన్ గిల్(2) ఔటయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(4) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లకు భారత్ స్కోర్.. 34
Yashasvi Jaiswal gets India underway 👊 #SAvIND LIVE NOW on @StarSportsIndia pic.twitter.com/XEZ2GtKhG1
— ESPNcricinfo (@ESPNcricinfo) December 26, 2023
టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ తెంబా బవుమా బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై రబాడ సఫారీలకు తొలి బ్రేక్ ఇచ్చాడు. రోహిత్ను వెనక్కి పంపాడు. ఆ కాసేటపికే యశస్వీని బర్గర్ ఔట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడిన భారత్ను విరాట్ కోహ్లీ(4), గిల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, బర్గర్ సూపర్ డెలివరీతో గిల్ను ఔట్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది.