లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడించింది. తొలి వికెట్ రూపంలో గిల్ ఔటైన తర్వాత.. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైంది. విహారీ, అయ్యర్, జడేజాలు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. రోహిత్ 25, గిల్ 21 రన్స్ చేశారు. 25 ఓవర్లు మగిసే వరకు ఇండియా 5 వికెట్లు కోల్పోయి 83 రన్స్ చేసింది. విరాట్ 8 రన్స్ చేసి క్రీజ్లో ఉన్నాడు. ఇండియన్ జట్టు ఆశలన్నీ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ మ్యాచ్లో లీసెష్టర్షైర్ తరపున ఇండియన్ ప్లేయర్లు కూడా ఆడుతున్నారు. ప్రాక్టీస్ నిమిత్తం పంత్, పూజారా, బుమ్రా, ప్రసిద్ధ్లు లీసెష్టర్షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.