న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెల 10న జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ భేటీకి హాజరుకావాలని పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలను కోరింది. అయితే ఈ సమావేశంలో పాల్గొనమని పాక్ తెలిపింది. చైనా మాత్రం ఇంకా నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇరాన్, రష్యా పాల్గొంటామని తెలిపాయి.