పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. నసీమ్ షా వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న కేఎల్ రాహుల్ (4) మైదానం వీడాడు. ఆ తర్వాత కాసేపటికే హారిస్ రవూఫ్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (4) కూడా పెవిలియన్ చేరాడు.
రవూఫ్ వేసిన బంతికి రోహిత్ రిఫ్లెక్సివ్గా తన బ్యాట్ అడ్డుపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్ వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఇఫ్తికర్ అహ్మద్ చటుక్కున క్యాచ్ పట్టేయడంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. భారత జట్టు 10 పరుగుల వద్దనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.