ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో ఆసీస్ జట్టు 186/7 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన రోహిత్ శర్మ (17) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ (69), కోహ్లీ (63) జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్య అవుటైన తర్వాత ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయడంతో కొంత టెన్షన్ నెలకొంది.
చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికే అతను అవుటయ్యాడు. ఆ ఓవర్ ఐదో బంతి.. పాండ్యా (25 నాటౌట్) బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లడంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్ను 2-1తో భారత్ వశం చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
What a win!
India seal the series with a memorable win in Hyderabad 💪🏻#INDvAUS | Scorecard: https://t.co/n1SfDGCcHW pic.twitter.com/33QQLBCOne
— ICC (@ICC) September 25, 2022