హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం వచ్చి చేరుతోంది. డ్యామ్లోకి ప్రస్తుతం 61,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఏడు గేట్లు ఎత్తి 21,840 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 7,500 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు కాగా.. గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 88.112 టీఎంసీలకు నీరు నిల్వ ఉన్నది.