Minister KTR | ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్ తర్వాత మరో ద్వితీయ శ్రేణి నగరమైన నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభం కాబోతుందని తెలిపారు. మరికొద్ది వారాల్లోనే ఐటీ హబ్ ప్రారంభిస్తామని ఆయన ట్వీట్ చేశారు. అలాగే.. సింగపూర్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ధర్మాన్ షణ్ముగరత్నానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Govt’s efforts to develop IT sector in Tier 2 towns is going on at a brisk pace
After Warangal, Khammam, Karimnagar, Mahbubnagar, Siddipet and Nizamabad now it’s Nalgonda
In a few weeks from now, Nalgonda will have its own IT Hub pic.twitter.com/1wwtc2tfc3
— KTR (@KTRBRS) September 2, 2023
ఐటీ హబ్ అనేది నల్లగొండకు ఏండ్ల నాటి కల. ఇది రెండు దశాబ్దాలుగా కలగానే ఉండగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంలో రూ.98కోట్లతో నిర్మితమైనది. తొందరలోనే ఐటీ హబ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవల మెగా కొలువుల మేళా కూడా నిర్వహించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే గాక మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు 15,316 మంది అభ్యర్థులు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ జాబ్మేళాను ప్రారంభించి ఆయా కంపెనీల ప్రతినిధులు, హాజరైన యువతతో మాట్లాడి వెళ్లారు. అనంతరం ఐటీ టవర్లో ఉద్యోగాల కల్పనకు తొలి దశలో 13 కంపెనీలు రాగా వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు తొలి దశలో 350 మందిని ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎక్కువగా బీటెక్, ఎంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు పోటీపడ్డారు.