లక్నో : యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహిత బహిర్భూమికి వెళ్లిన సమయంలో కొందరు ఆమె దుపట్టాతో ఊపిరి ఆడకుండా చేసి ఉసురు తీశారు. ఆపై మృతదేహాన్ని నీటి కుంటలో పడేసి పరారయ్యారు. ఎంతసేపటికి మహిళ ఇంటికి తిరిగిరాకపోవడంతో బాధితురాలి భర్త, కటుంబసభ్యులు ఆమె కోసం గాలించగా నీటికుంటలో మృతదేహం కనిపించింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిని ఊపిరాడకుండా చేసి చంపేశారని, పోస్ట్మార్టం అనంతరం పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని చెప్పారు.