కొండాపూర్, మార్చి 25 : మాదాపూర్లోని శిల్పారామంలో డెవలప్మెంట్ ఆఫ్ కమిషనర్ హ్యాండ్లూమ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ న్యూ ఢిల్లీ, వీవెర్స్ సర్వీసింగ్ సెంటర్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోను శుక్రవారం అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ వివేక్ కుమార్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత, హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా హ్యాండ్లూమ్స్ ఎక్స్పోను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎక్స్పోలో చేనేత, హస్తకళా ఉత్పత్తులను మాత్రమే అమ్మకాలు చేయాల్సిందిగా తెలిపారు. ఎక్స్పోలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన 60 మంది చేనేత కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అరుణ్ కుమార్, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్యలు పాల్గొన్నారు.
శిల్పారామంలో కొనసాగుతున్న డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం ఆంఫీథియేటర్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనల్లో శుక్రవారం సాయి ఆర్ట్స్ అకాడమీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కళాకారులు మూషిక వాహన, తారంగం, భామాకలాపం, దేవా దేవమ్, గరుడ గమన, జై జనార్ధన, ముద్దుగారేయ్ యశోధ, మహాగణపతిమ్, ఏకదంతాయ, హనుమాన్ చాలీసా అంశాలను కూచిపూడి నృత్య రూపకంలో అద్భుతంగా ప్రదర్శించారు. వీటితో పాటుగా నృత్య కుండలు, దీపాలపై ప్రదర్శించిన అంశాలు ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రముఖ నటి సుధాచంద్రన్ కళాకారులను జ్ఞాపికలతో సత్కరించారు.