కమాన్చౌరస్తా, ఏప్రిల్ 4: జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, ఆకస్మిక తనిఖీకి వచ్చే వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫోన్తో కేంద్రంలోకి అనుమతించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పదో తరగతి పరీక్షల నిర్వహణ, చేపట్టాల్సిన ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ, జి ల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి మంత్రికి, అధికారులకు అడిషనల్ కలెక్టర్ వివరించారు. జిల్లాలో 76 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న ట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఇప్పటికే జి ల్లాస్థాయి సమావేశాలు నిర్వహించి, పలు సూచనలను, ఆదేశాలు జారీ చే శామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టంగా 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప రీక్షా కేంద్రాల వద్ద పోలీస్, రెవెన్యూ, ఫ్లయింగ్ స్కాడ్ అధికారులను అప్రమత్తంగా ఉంచామన్నారు. ఇకపై జరిగే పరీక్షలకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇ తర సంబంధిత మండల స్థాయి అధికారులు ఆ కస్మిక తనిఖీలు నిర్వహించాలని సూ చించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల వద్ద ఎవరూ గుమిగూడి ఉండకుండా స్థానిక ఎస్ఐ ద్వారా పరిసర ప్రాంతాలను పర్యవేక్షించేలా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే సిబ్బంది ఎవరికి కూడా పరీ క్షా కేంద్రంలోకి సెల్ఫోన్, స్మార్ట్వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అనుమంతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీకి వచ్చే అధికారులు ఎవరైనా సరే వారిని కూడా సెల్ఫోన్తో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంత రం అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, పశ్నాపత్రాలను కేంద్రాలకు చేర్చడం మొదలు పరీక్షా అనంతరం జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు చేర్చడం వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, పశ్నాపత్రాల తరలింపులో వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లయితే వాటి జాబితాను నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ స్థాయి అధికారిని ఉంచి కట్టుదిట్టమైన చర్య లు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్ కుమార్, హరిసింగ్, విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, ఏసీపీలు కరుణాకర్, తుల శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.