Rythu Bheema | నేను శామీర్పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది. పొలం మీద ఆధారపడి బతకడం తప్ప మాకు వేరే ఆధారమేమీ లేదు. ఇటు చూస్తే పెండ్లికి వచ్చిన బిడ్డ ఏమి చేయాలో తెలియని పరిస్థితి. చావు చేయడానికి ఖర్చకు చేతిలో చిల్లిగవ్వలేదు. ఊరోళ్లు కొంత మంది సాయం చేస్తే చావు చేశాను. నా కూతురు, నేను ఇల్లరికం వచ్చిన ఊళ్లో బతకడం కష్టం అన్పించింది. ఆ సమయంలో నా భార్య పేరు మీద పొలం ఉండటంతో రైతుబీమా వస్తదని చెప్పారు. రైతుబీమా కింద రూ.5 లక్షల చెక్కును ఇచ్చారు. ఆ డబ్బులతో బిడ్డ పెండ్లి చేశాను. రైతు బీమా లేకపోతే మేం ఏమైపోయేవాళ్లమో. నా బిడ్డ పెండ్లి ఎట్లా చేయాలని బాధపడుతున్న సమయంలో రైతుబీమా ఆదుకుంది. సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. పేదలను ఆదుకుంటున్న ఆయన కలకాలం సల్లంగా ఉండాలి.
సల్లగ బతుకుతున్నాం
నా భర్త నర్సింహ వ్యవసాయంతో పాటు గ్రామపంచాయతీ వాటర్ ఫిల్టర్ వద్ద పనులు చేసేవాడు. రాత్రి పూట వాటర్ ఫిల్టర్ రూమ్లోని పడుకుని అనుకోకుండా చనిపోయిండు. మాకు 35 గుంటల భూమి తప్పించి, ఏ ఆధారం లేదు. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉంది. అప్పటికే వాళ్ల పెండ్లిలు అయ్యాయి. కొడుకులు కూలినాలీ చేసుకుంటూ బతికేవాళ్లు. వాళ్ల పెండ్లిల, ఇంటి అవసరాల కోసం చేసిన అప్పులు నెత్తిమీద ఉన్నాయి. లక్షల రూపాలు ఎలా కట్టాలో, కట్టినంక ఎట్టా బతకాలి తెలువలేదు.
అప్పుడు రైతుబీమా కింద ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆదుకున్నాయి. ఆ పైసలతోనే అన్ని అప్పులు కట్టుకున్నాం. లేదంటే ఉన్న జరంత భూమి కూడా అమ్ముకోవాల్సి వచ్చేది. నేను పుట్టినప్పటి నుంచి రైతుల గురించి గిట్లా పట్టించుకున్న వాళ్లే లేరు. రైతుల కుటుంబాలు ఆగం కాకుండా ఆ అయ్యా(కేసీఆర్) చూస్తుండు. మాకు కేసీఆర్ ఇంటి దిక్కుగా మారిండు. ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ రుణం తీర్చుకోలేం. ఉన్న భూమికి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందుతున్నది. పెట్టుబడి సాయంతో కూరగాయలు సాగు చేసుకుంటున్నాం.
-వీరమణి లాల్గడీమలక్పేట, శామీర్పేట, మేడ్చల్ జిల్లా