9.00am జనరల్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.
11.35: సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగారు.
11.48 am అక్కడినుంచి 94 కిలోమీటర్ల దూరంలోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో ప్రసంగించేందుకు జనరల్ రావత్ సహా వీరంతా ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్లో బయల్దేరారు. వెల్లింగ్టన్ చేరుకోవాలంటే.. నీలగిరి కొండల్లో విస్తరించిన దట్టమైన అడవుల గుండా ప్రయాణించాలి.
12.18 pm దాదాపు అరగంట తర్వాత ప్రయాణ మార్గంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలట్ బేస్స్టేషన్తో సంప్రదింపులు జరిపారు.
12.22 pm హెలికాప్టర్కి బేస్స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి.
12.23 pm హెలికాప్టర్ మిస్ అయినట్టు బేస్స్టేషన్లోని అధికారుల నిర్ధారణ
12.27 pm కట్టేరీలోని నంచప్పచత్రం ప్రాంతంలో పెద్ద చెట్టుపై భారీశబ్దంతో హెలికాప్టర్ క్రాష్. గమ్యస్థానానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకొన్నది.
12.30 pm చెట్టుపై తలకిందులుగా పడ్డ చాపర్..ఒక్కసారిగా మంటలు. హెలికాప్టర్ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూనే కిందపడ్డారు.